ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌‌‌కు అస్వస్థత

by  |
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌‌‌కు అస్వస్థత
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమె తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా.. పర్యటనలు రద్దు చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో పాటు, బీపీ హెచ్చుతగ్గుల మూలంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు సమాచారం. స్థానిక వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో తన నివాసంలోనే చికిత్సతో పాటు, విశ్రాంతి పొందుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed