కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వ‌స్తే ఖ‌బ‌ర్ధార్.. దెబ్బకు దెబ్బ తీస్తాం

by  |
కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వ‌స్తే ఖ‌బ‌ర్ధార్.. దెబ్బకు దెబ్బ తీస్తాం
X

దిశ, హాలియా : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగుల పల్లి మండల పరిధిలోని ఆబంగాపురం, గజలా పురం, పూసలపాడు, నారాయణపురం గ్రామాలలో విస్తృతంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పక్క జిల్లాల నుంచి వ‌చ్చిన నాయకులు బెదిరింపుల‌కు పాల్పడితే దెబ్బకు దెబ్బ తీస్తామని తెలిపారు.

సీఎంగా కేసీఆర్ అస‌మ‌ర్ధుడు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 200 కోట్లు ఉన్న వాణి దేవిని ఎమ్మెల్సీగా చేసి మ‌లిద‌శ తొలి అమ‌రుడు శ్రీకాంతా చారి త‌ల్లి శంక‌ర‌మ్మను ఎమ్మెల్సీగా ఎందుకు చేయ‌లేదనీ ప్రశ్నించారు? జానారెడ్డికి ఉప ఎన్నికల్లో ప్రజల మ‌ద్దతు చూడ‌లేక‌నే టీఆర్ఎస్ పార్టీ బెదిరింపు రాజ‌కీయాలు పాల్పడుతోందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజ‌కవర్గ స‌మ‌స్యలు గాలికి వ‌దిలేసి నాగార్జున‌సాగ‌ర్‌లో డ‌బ్బు మూట‌ల‌తో తిరుగుతున్నారు.

2019 ఎంపీ ఎన్నిక‌ల్లో సొంత బిడ్డను గెలిపించుకోలేని కేసీఆర్ నాగార్జున సాగ‌ర్‌లో వారి అభ్యర్ధిని ఎలా గెలిపిస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత‌లు, కార్యక‌ర్తల‌పై బెదిరింపుల‌కు పాల్పడితే ఖ‌బ‌ర్ధార్ అని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెచ్చరించారు. మ‌రోసారి కాంగ్రెస్ నేత‌ల‌ను భ‌య‌పెట్టాల‌ని చూస్తే దెబ్బకు దెబ్బ తీస్తామ‌ని స్పష్టం చేశారు.

Next Story