కేజీఎఫ్ ప్రసారం చేసిన తెలుగు చానల్ పై కేసు వేస్తాం : కేజీఎఫ్ నిర్మాత

by  |
కేజీఎఫ్ ప్రసారం చేసిన తెలుగు చానల్ పై కేసు వేస్తాం : కేజీఎఫ్ నిర్మాత
X

యశ్​ హీరోగా, ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో వ‌చ్చిన ‘కేజీఎఫ్​’.. దేశవ్యాప్తంగా అఖండ విజయం అందుకుంది. ఈ ఒక్క సినిమాతో య‌శ్ ఓవ‌ర్ నైట్ సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్​బాస్టర్​ విజయం సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెండో పార్ట్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత హైదరాబాద్ లో వేసిన సెట్ లో కేజీఎఫ్ -2 షూటింగ్ జరగనుంది. ఇందులో రవీనా టాండన్, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం డిజిటల్​హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులపై ఓ చానెల్ తో చిత్ర నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమయంలో కేజీఎఫ్ సినిమాను ఓ తెలుగు లోకల్ చానెల్ అక్రమంగా ప్రసారం చేసింది. దీనిపై కేజీఎఫ్ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, సదరు చానెల్ పై కేసు వేస్తామని ట్వీట్ చేశారు. ఓ వైపు శాటిలైట్ డీల్స్ దాదాపు ఫైన‌ల్ అవుతున్న స‌మ‌యంలో కేబుల్ ఛానెల్ చిత్రాన్ని ప్రసారం చేయడం ఇల్లీగల్ అని, తమ దగ్గర ఆ ఛానెల్‌లో ప్రసారమైనట్టు స్క్రీన్ షాట్స్, వీడియోలు ఉన్నాయని నిర్మాత కార్తిక్ గౌడ తెలిపారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం అంటూ ట్వీట్ చేశారు. ఇక రెండో పార్ట్ ‘కేజీఎఫ్ 2’ కు సంబంధించిన డిజిటల్​ హక్కులను రూ.55 కోట్లతో అమెజాన్​ ప్రైమ్​ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.


Next Story

Most Viewed