- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి గోడ దూకేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేరి ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి భారీ షాకిచ్చే యోచనలో ఉన్నారు. గత కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని పలువురు బీజేపీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. నేడో, రేపో ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కేశినేని భవన్లో చంద్రబాబు, టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారని తెలుస్తోంది. కేశినేని భవన్లో ఇంతకుముందు చంద్రబాబు, కేశినేని నాని కలిసి ఉన్న ఫోటోలు కనిపించేవి. కానీ ఇప్పుడు రతన్ టాటాతో కేశినేని దిగిన ఫోటోలు దర్శనమిస్తున్నాయి..
దుమారం రేపుతున్న కేశినేని వ్యవహారం.. చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు