నాగుపాముతో భార్య మర్డర్

by  |
నాగుపాముతో భార్య మర్డర్
X

కొల్లాం: కేరళలో ఓ ప్రబుద్ధుడు నాగుపాముతో భార్యను చంపేసే స్కెచ్ వేశాడు. సహజంగా జరిగిపోయినట్టు ఉంటుందని, అనంతరం ఆమె తీసుకొచ్చిన కట్నంతో మరొక లేడీతో చెక్కేయాలనుకున్నాడు. కానీ, ఆ స్కెచ్ బయటపడింది. ఇప్పుడు ఆ హంతకుడు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే పెండ్లి చేసుకున్న సూరజ్, ఉత్రాలు కేరళలోని కొల్లాంలో కాపురం పెట్టారు. డబ్బు, బంగారం పెద్ద మొత్తంలో కట్నం కింద సూరజ్ స్వీకరించాడు. కానీ, జీవితాన్ని పంచుకోవాల్సిన ఉత్రాను తప్పించుకుని మరో అమ్మాయితో కలిసుండాలని దురాశపడ్డాడు. తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఎవ్వరికీ అనుమానం రాకుండా భార్యను హతమార్చాలనుకున్నాడు. ఇందులో భాగంగానే మిత్రుడు సురేష్ దగ్గర నుంచి రక్త పింజర పాము కొనుగోలు చేసి మార్చి చివరిలో ఇంటిలో వదిలాడు. అయితే, ఈ పాము ఉత్రాను కుట్టినప్పటికీ హాస్పిటల్‌లో ఆమె కోలుకుంది. అదే ప్లాన్ మరోసారి అమలు చేశాడు. ఏప్రిల్‌లో సురేష్ దగ్గర నుంచి ఈసారి నాగుపాము కొన్నాడు. మే 6వ తేదీన బెడ్‌రూమ్‌లో పడుకున్న ఉత్రా దేహంపై నాగుపామును వదిలిపెట్టాడు. రెండు సార్లు కాటేసేవరకూ చూస్తూ కూర్చున్నాడు. ఏమీ ఎరగనట్టు ఉదయం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఉత్రా మరణించిందని వైద్యులు తెలిపారు. కానీ, రెండు సార్లూ పాము కాటేసిన ఘటనలు చోటుచేసుకోవడంతో ఉత్రా కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు. ఫలితంగా పోలీసుల దర్యాప్తులో ఈ మర్డర్ స్కెచ్ వెల్లడైంది.



Next Story

Most Viewed