అయ్యప్ప భక్తులకు గుడ్‎న్యూస్

by  |
అయ్యప్ప భక్తులకు గుడ్‎న్యూస్
X

దిశ, వెబ్‎డెస్క్: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనం కోసం శని, ఆదివారాల్లో మూడు వేల మంది భక్తులకు అనుమతిచ్చారు. మిగతా రోజుల్లో ప్రతి రోజు రెండు వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చారు. అయ్యప్ప దర్శనం కోసం ఆన్‎లైన్‎లోనే టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. శబరిమల మార్గంలో కరోనా టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.


Next Story