సొంత పార్టీ నేతపై కేజ్రీవాల్ వేటు

by  |
సొంత పార్టీ నేతపై కేజ్రీవాల్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల ఢిల్లీలో హింస చెలరేగడంతో అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలో తాహిర్‌కు సంబంధం ఉందంటూ దయాళ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు అయింది.
చాంద్‌బాగ్‌లోని తాహిర్ కర్మాగారం, నివాసం అల్లర్లకు కేంద్ర బిందువుగా ఉన్నట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. దీంతో తాహిర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ గురువారం రాత్రి ప్రకటించారు.

Next Story