కీర్తి "పెంగ్విన్" ఓటిటిలో విడుదల

by  |
కీర్తి పెంగ్విన్ ఓటిటిలో విడుదల
X

కీర్తి సురేష్.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తన నుంచి మరో చిత్రం విడుదల కాలేదు. పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాల షూటింగ్ దాదాపు పూర్తయి.. విడుదలకు సిద్ధంగా ఉన్నా.. కరోనా కాస్త ఆటంకంగా మారింది. మహమ్మారి కారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు చాలా సమయం పట్టే చాన్స్ ఉంది. దీంతో నిర్మాతలు ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలో పెంగ్విన్ నిర్మాతలు కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుండగా… జూన్ నెలలో సినిమా ప్రసారం కానుందట. కీర్తి గర్భిణీ స్త్రీ పాత్రలో కనిపించనున్న పెంగ్విన్ ను కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు.

కాగా లారెన్స్ దర్శకత్వం వహించిన లక్ష్మీ బాంబ్ సినిమా కూడా ఓటిటిలో విడుదల అవుతుంది. కాంచన రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారానే లారెన్స్ డైరెక్టర్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.



Next Story

Most Viewed