నిర్మాతను మిస్సవుతున్న కీర్తి..

by  |
నిర్మాతను మిస్సవుతున్న కీర్తి..
X

మహానటి సినిమా కీర్తి సురేశ్‌కు భారీగా కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చింది. మహానటి సావిత్రమ్మ జీవితాన్ని తెరపై సజీవంగా సాక్షాత్కరింపజేసిన తన నటనకు జాతీయ అవార్డును కూడా అందుకుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకు స్వప్న దత్ నిర్మాత కాగా.. ఈ చిత్రం షూటింగ్ సమయంలో స్వప్న, కీర్తి చాలా మంచి స్నేహితులయ్యారు. కాగా లాక్‌డౌన్ కారణంగా స్వప్నను మిస్సయిన కీర్తి.. తన గురించి ఒక పోస్ట్ పెట్టింది.

సోషల్ మీడియాలో చాలా ఎక్సైటింగ్‌గా ఉన్న తన ఫొటోను షేర్ చేసిన కీర్తి.. స్వప్నను చూసినప్పుడు ఎప్పుడూ ఇలాగే ఫీల్ అవుతానని తెలిపింది. లేదంటే లాస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఆనందంగా ఉంటాను అని కామెడీ చేసింది కీర్తి. ‘మిస్ యూ స్వప్న’ అంటూ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన స్వప్న దత్.. ‘లవ్ యూ కీర్తి’ అని చెప్పింది.

https://www.instagram.com/p/CC-kAlFJHdZ/?igshid=1led726adfbn5


Next Story

Most Viewed