మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన సీఎం…

by  |
మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన సీఎం…
X

కాళేశ్వరం సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరికి పూజలు చేశారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులను బ్యారేజ్ బ్యాక్ వాటర్ ఎంత మేర ఉంది, సామర్థ్యానికి సరిపడా నీరు ఎన్ని రోజుల్లో చేరనుంది తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. మొట్టమొదటి సారి నీటిని నిలువ ఉంచుతున్నందన అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కాళేశ్వరం వద్ద గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం గోదావరి మాతకు సారె చీరె అందించారు. అనంతరం కాళేశ్వరం క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కాళేశ్వర ఖండం పుస్తకావిష్కరణ చేశారు.



Next Story

Most Viewed