వీనికి ఫోన్ చేసి చెప్పిందా?.. ‘కేసీఆర్’ షాకింగ్ కామెంట్స్

by  |
CM-Kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు రోజులుగా సమావేశాలలో పూర్వపు హుషారు చూపుతున్నారు. చెణుకులు విసురుతూ ప్రసంగాలను రక్తి కట్టిస్తున్నారు. సోమవారం వరంగల్ పర్యటనలోనూ దానిని పునరావృతం చేశారు. థర్డ్ వేవ్‌పై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ‘స్కూళ్లు లేకపోవడంతో పిల్లలంతా ఇండ్లను అంగడంగడి చేస్తున్నరు. థర్డ్ వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని పుకార్లు లేపిండ్రు. కరోనా వీనికి ఫోన్ చేసి చెప్పిందా. ఈ తాప అచ్చి పిల్లలకు పడతాననని’ అంటూ సైటైర్ వేశారు. ‘ఇప్పటికే కరోనా బాధితులు పుస్తెల తాళ్లు కూడా అమ్ముకుని దవాఖానలకు లక్షలు ధారపోసిండ్రు.. దండం పెట్టి చెబుతున్నా.. పుకార్లు మానండి.. మాస్కు పెట్టుకోమని చెప్పండి.. కానీ, భయపెట్టకండి’ అంటూ వ్యాఖ్యానించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story