మోసగించడంలో కేసీఆర్ ​పీహెచ్‌డీ పూర్తి చేసినట్టుంది : విజయశాంతి

by  |
BJP leader Vijayashanti
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఆమె సీఎంపై సెట్లర్లు వేశారు. దళితులకు మూడెకరాలు, దళిత బంధులాంటి ఎన్నో విషయాల్లో తానే స్వయంగా చేస్తున్న మోసాలు కేసీఆర్‌కు కానరావడం లేదన్నారు. ఇక్కడి ప్రజల ఇబ్బందులు పట్టించుకోని సీఎం ఢిల్లీ వద్ద మరణించిన రైతులను చూసి తన హృదయం కరిగిపోయినట్టు బిల్డప్పులివ్వడం చూస్తుంటే ప్రజల్ని మోసగించడంలో కేసీఆర్ పీహెచ్‌డీ పూర్తి చేసినట్టు అనిపిస్తోందని ఆమె విమర్శలు చేశారు.

ఎల్లకాలం అందరినీ మోసగించలేమని కేసీఆర్ గ్రహించే రోజులు దగ్గరపడుతున్నాయని, ఆయన గుర్తించే సమయం కూడా దగ్గర్లోని ఉందని ఆమె అన్నారు. వేదనతో కళ్లెదురుగా రోదిస్తున్న ఇక్కడి ప్రజలను గాలికొదిలేసి లోకాన్ని ఉద్ధరించడానికి వెళతానన్నట్టు కేసీఆర్ వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదమన్నారు.

Next Story

Most Viewed