హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా కేసీఆర్ వ్యవహారశైలీ

by  |
Vijayashanti Facebook
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో సీఎం కేసీఆర్ గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారని, నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎంపై తన దైన శైలీలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్న వారిపై దాడులు జరుగుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు.

చట్టాలను కాపాడాల్సిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి… గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారని ఆరోపించారు. లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా మీ సయామీ ట్విన్ పార్టీ ఎంఐఎం నేతలు చట్ట విరుద్ధంగా బక్రీద్ రోజున గోవధ చేస్తామంటూ డీజీపీకి వినతి పత్రం ఇస్తే మీరు చూస్తూ ఊరుకున్నారు తప్ప చేస్తున్నదేమీ లేదన్నారు. అసలు ఇలాంటి వినతి పత్రం ఇచ్చినందుకు ఆ పార్టీ నేతలను రాజ్యాంగబద్ధమైన పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చిందన్నారు. ఈ పరిణామాలపై తగిన చర్యలు తీసుకుని గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా సర్కారుదే అన్నారు. లేకుంటే హిందూ సమాజం ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు.

Next Story

Most Viewed