సీఎం కేసీఆర్‌పై ఫేస్‌బుక్ పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్టు.

by  |
సీఎం కేసీఆర్‌పై ఫేస్‌బుక్ పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్టు.
X

దిశ, క్రైమ్‌బ్యూరో: సీఎం కేసీఆర్‌పై ఫేస్‌బుక్‌లో అనుచితంగా, అభ్యంతరకంగా పోస్టు పెట్టిన యువకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్‌కు ముక్కు ద్వారా కరోనా సోకి మరణించినట్టుగా, ఈ మరణాన్ని గాంధీ వైద్యులు ధవీకరించినట్టుగా జగిత్యాల జిల్లా మాల్య మండలం లంబాడీపల్లి గ్రామానికి చెందిన పన్యాల రాజు (27) సీఎం ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇతను దుబాయ్‌లో ఉంటున్నట్టు తెలుసుకొన్న పోలీసులు ఎల్ఓసి నోటీసు జారీ చేశారు. దీంతో ఈనెల 14వ తేదీన ముంబయి విమనాశ్రాయానికి రాజు చేరుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రాజును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్ కు తరలించారు.



Next Story

Most Viewed