ఈటల టార్గెట్‌గా కేసీఆర్ కొత్త వ్యూహం.. 80 మంది యువకులతో

by  |
Etala Kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొంతకాలం కిందట వరకు సోషల్​ మీడియాను పట్టించుకోని టీఆర్‌ఎస్​ అధినేత కేసీఆర్​ ఇప్పుడు దాన్నే కీలకంగా మల్చుకుంటున్నారు. టీఆర్​ఎస్​ సోషల్​ మీడియా వింగ్‌తో గురువారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని సైతం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​కు చెందిన ఓ యువనేతకు సోషల్​ మీడియా బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం హుజురాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎడాపెడా అనుకూల వార్తలను సృష్టించడమే ఈ టీం లక్ష్యంగా దిశానిర్ధేశం చేశారు. మొత్తం 80 మంది యువకులతో టీఆర్​ఎస్​ సోషల్​ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసి పూర్తి బాధ్యతలను అప్పగించారు. కూకట్​పల్లి ప్రాంతానికి చెందిన యువనేతకు ఈ బాధ్యతలను అప్పగించారు.

బీజేపీ ఏది చేస్తే.. దానికి కౌంటర్​

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సోషల్​ మీడియా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు టీఆర్‌ఎస్​ అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు బీజేపీ ఎలాంటి న్యూస్​ క్రియేట్​ చేసి సోషల్​ మీడియాలో వైరల్ చేస్తుందో.. అదే పంథాను టీఆర్‌ఎస్​ కూడా అవలంభించనుంది. ఆ వార్తలను తప్పుడుగా చూపించడం, కౌంటర్​ న్యూస్‌లను​ సృష్టించడమే ఈ టీం బాధ్యత. ప్రభుత్వ అనుకూలత కోసం పేపర్ల క్లిప్పింగ్‌లను సైతం విస్తృతంగా వినియోగించుకోనున్నారు. దీనికి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాలోని బృందాన్ని సైతం వాడుకుంటున్నారు. అవసరమైతే ఆయా పత్రికల ఫాంట్స్​, నమూనాలతో ఈ టీం న్యూస్‌ను క్రియేట్​ చేయనుంది. తద్వారా సదరు మీడియాలోనే వచ్చినట్లు చూపించనున్నారు.

బీజేపీ సోషల్​ మీడియాకు బ్రేక్​

ప్రస్తుతం బీజేపీ సోషల్​ మీడియాలో చాలా బలంగా పని చేస్తుండటంతో ఇక నుంచి గులాబీ సోషల్​ మీడియా దానికి బ్రేక్​ వేయాలని అధిష్టానం ఆదేశిస్తోంది. టీఆర్‌ఎస్​ వింగ్​ సృష్టించిన న్యూస్‌ను వైరల్​ చేయడం, ప్రచారం కల్పించేందుకు ఓ మీడియాలోని నెట్​వర్క్​ టీంను సైతం వాడుకోనున్నారు. ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్‌లో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఈ సోషల్​ మీడియాలో గులాబీ సైన్యం, టీఆర్‌ఎస్​ ఫాలోవర్స్​ అంటూ వందల సంఖ్యలో గ్రూపులు నమోదయ్యాయి. బీజేపీ గ్రూపులను సైతం ఈ టీం వాచ్​ చేస్తోంది.

Next Story

Most Viewed