ఏడు కోట్లు పోగొట్టిన ప్రశ్న ఇదే!

by  |
ఏడు కోట్లు పోగొట్టిన ప్రశ్న ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : కేబీసీ సీజన్ 12లో చివరి వరకు ఆడిన మొదటి కంటెస్టంట్‌గా నాజియా నాసిమ్ రికార్డుకెక్కింది. ‘ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ ఫిల్మ్ అవార్డు పొందినది ఎవరు?’ అనే ప్రశ్నకు రూపా గంగూలీ అని సరైన సమాధానాన్ని ఎంచుకుని నాజియా రూ. 1 కోటి గెలుచుకున్నారు. ఆ తర్వాత రూ. ఏడు కోట్ల ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేక కోటి రూపాయలతో వెనుదిరిగింది. అయితే ఆమె సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న.. ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో ఆజాద్ హింద్ గవర్నమెంట్ మొదటి ప్రొక్లమేషన్ ఎక్కడ చేశారు?’ అని. దీనికి సమాధానం క్యాథే సినిమా హాల్ కాగా, నాజియా నాసిమ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అని తప్పుగా చెప్పింది. దీంతో ఒక కోటి రూపాయలతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.



Next Story

Most Viewed