ఈటల రాజేందరన్నా.. ర్యాపిడ్ కిట్లు పంపించండి : ట్విట్టర్‌లో కవిత

by  |
ఈటల రాజేందరన్నా.. ర్యాపిడ్ కిట్లు పంపించండి : ట్విట్టర్‌లో కవిత
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా రక్కసి రెక్కలు చాస్తున్న తరుణంలో కరోనా టెస్టులు చేయించుకునే వారి సంఖ్య కూడా అలాగే పెరిగిపోయింది. అయితే నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కు ట్విట్టర్ ద్వారా ఓ సహకారం అడిగారు. కోరుట్లలో పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా అక్కడికి మరిన్ని కొవిడ్ టెస్ట్ కిట్స్ పంపించాలని ట్విట్టర్ వేదికగా అడిగారు. ఇందుకు ఈటల కూడా స్పందిస్తూ నోటెడ్ డాక్టర్ జీఎస్ రావు టేక్ కేర్ అంటూ రిప్లై ఇచ్చారు.

Next Story

Most Viewed