షాకింగ్.. నడిరోడ్డుపై మాజీ మేయర్ దారుణ హత్య..

by  |
Shivraj
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి.. మాజీ మేయర్‌పై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు.

వివరాల ప్రకారం.. బీహార్‌లోని కతిహార్ పట్టణ నగర మాజీ మేయర్ శివరాజ్ పాసవాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు.. శివరాజ్‌పై కాల్పులు జరిపి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్ర గాయాలు పాలైన పాసవాన్‌ను అధికారులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల పాసవాన్ మృతి చెందారు. అయితే, ఈ ఏడాది మార్చిలో తాత్కాలిక నగర మేయర్‌గా ఎన్నికైన పాసవాన్.. జూన్​ వరకు బాధ్యతలు చేపట్టారు. మేయర్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed