కూలీలకు బాసటగా సరిహద్దు పోలీసులు

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్: కాలి నడకన వెలుతున్న వలస కూలీలకు కరీంనగర్ జిల్లా సరిహద్దు పోలీసులు బాసటగ నిలిచారు. రోడ్డుమీద వెళ్తున్న వారిని పిలించి భోజనం పెట్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం జరిగింది. వరంగల్ నుంచి మహారాష్ట్రకు కాలి నడకన వెలుతున్న వలస కూలీలను గుర్తించిన పోలీసులు వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో 25మందికి భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మహదేవపూర్ [&hellip;]</p>

కూలీలకు బాసటగా సరిహద్దు పోలీసులు
X

దిశ, కరీంనగర్: కాలి నడకన వెలుతున్న వలస కూలీలకు కరీంనగర్ జిల్లా సరిహద్దు పోలీసులు బాసటగ నిలిచారు. రోడ్డుమీద వెళ్తున్న వారిని పిలించి భోజనం పెట్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం జరిగింది. వరంగల్ నుంచి మహారాష్ట్రకు కాలి నడకన వెలుతున్న వలస కూలీలను గుర్తించిన పోలీసులు వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో 25మందికి భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ నర్సయ్య, ఎస్సై శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Tags : border police, food arrange to road walkers, corona, lockdown

Next Story