సీఎం కీలక నిర్ణయం.. రైతులకు 10వేలు, ఆటో, ట్యాకీలకు 3వేలు సాయం

by  |
సీఎం కీలక నిర్ణయం.. రైతులకు 10వేలు, ఆటో, ట్యాకీలకు 3వేలు సాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం కర్నాటకలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 1200 కోట్లతో సీఎం ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్యానవన రైతులకు హెక్టారుకు నెలకు రూ. 10వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. అలాగే ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు నెల రూ. 3వేలు, వీధి వ్యాపారులకు నెలకు రూ. 2వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు పేర్కొన్నారు.


Next Story

Most Viewed