కర్నాటక సీఎం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

by  |
కర్నాటక సీఎం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
X

దిశ, వెబ్ డెస్క్: కర్నాటక సీఎం యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన సోమవారం విడుదల అయ్యారు. తాజాగా ఆయనకు మరోసారి కరోనా టెస్ట్ చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు మణిపాల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల యడియూరప్పకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కాగా, కర్నాటక వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల లాక్‌డౌన్ మరోసారి విధించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed