- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బెంగళూరు: కర్ణాటకలో కరోనా పరిస్థితులు చేయి దాటిపోయాయని, దాన్ని నియంత్రించలేని స్థితికి చేరుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన మాట్లాడుతూ.. కరోనాను అదుపులోకి తెచ్చే దశను దాటిపోయామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురికి కరోనా సోకిందని చెప్పారు. దీనికి పరిష్కారం మాస్కులు ధరించడం, చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడమేనని ప్రధానమంత్రి చెబుతున్నారని గుర్తుచేశారు. ఈ జాగ్రత్తలనూ ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి అడుగు బయటపెట్టొద్దని ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తు్న్నాని తెలిపారు. పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయని ఆందోళన చెందారు. కరోనాను నియంత్రించలేని దశకు చేరుకున్నామని వివరించారు.
Next Story