- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ మండల ఇంచార్జ్ వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సింగపూర్ గ్రామంలో కరీంనగర్ మేయర్, హుజురాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ సునీల్ రావు అధ్యక్షతన కౌన్సిలర్లు, సర్పంచ్లు ఎంపీటీసీలతో విడి విడిగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ నెల 13న హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. మండలంలోని కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా ప్రతినిధులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలన్నారు.
Next Story