మీరెవరండి… మాట్లాడటానికి

by  |
మీరెవరండి… మాట్లాడటానికి
X

దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ సిబ్బంది ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. వారికి మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు నచ్చ చెప్పేందుకు రాగా సూపరిండెంట్ అనితారెడ్డి, చైర్మన్‌పై దురుసుగా ప్రవర్తించారు. కోవిడ్ టెస్టుల కోసం వస్తున్న ప్రజలకు పరీక్షలు ఎందుకు చేయడం లేదని చైర్మన్ ప్రశ్నించారు. మీరెవరండి మా ఆసుపత్రి ఆవరణలోకి వచ్చి మాట్లాడాటానికి అంటూ సూపరింటెండెంట్ వ్యాఖ్యానించడంతో రాజేశ్వర్ రావు అవాక్కయ్యారు. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అదనపు కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. మూడు గంటలుగా అదనపు కలెక్టర్ కోసం చైర్మన్, కౌన్సిలర్లు ఆసుపత్రి ఎదుట ఎదురు చూస్తున్నారు.


Next Story

Most Viewed