సంజనా క్షేమమే: కోన

by  |
సంజనా క్షేమమే: కోన
X

కరణం మల్లీశ్వరి బయోపిక్ దర్శకురాలు సంజనారెడ్డి పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు టాలీవుడ్ మీడియాలో ఊపందుకున్నాయి. తను ఐసీయూలో చికిత్స పొందుతోందని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన నిర్మాత కోన వెంకట్.. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించాడు. లేడీ డైరెక్టర్ సంజనా క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు. వైరల్ ఫీవర్‌తో ట్రీట్‌మెంట్ తీసుకున్న తను ఇప్పుడు బాగుందన్న ఆయన మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందని తెలిపారు. ఇలాంటి వార్తలకు స్వస్తి చెప్తే బాగుంటుందని హితవు పలికాడు.

రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘రాజుగాడు’ సినిమాతో దర్శకురాలిగా మారిన సంజనారెడ్డి.. తన రెండో సినిమాగా కరణం మల్లీశ్వరి బయోపిక్ తీస్తున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు.

Next Story