మోడీని ఎగతాళి చేస్తూ కాంగ్రెస్ నేత ట్వీట్.. వైరల్

by  |
Kapil-Sibhal
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఎగతాళి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. పేదరికం, ఆకలి నిర్మూలన, భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చడంపై ప్రభుత్వం పదే పదే చెబుతున్న అంశాలను ఎగతాళి చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్‌ చేసి ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ‘ఇగో ఈ నివేదిక చూడండి.. మీరు పదే పదే చెప్పే గొప్పలు అవాస్తవమని రుజువయ్యింది.. ఇప్పటికైనా అవాస్తవాలను ప్రచారం చేయడం మానివేయాలి’ అంటూ ప్రధాని మోడీకి, బీజేపీ నేతలకు కపిల్ సిబల్ పరోక్షంగా చురకలంటించారు. చూడాలి మరీ.. కపిల్ సిబల్ ట్వీట్ పై బీజేపీ నేతలు, మోడీ ఏ విధంగా స్పందిస్తారో అనేది.

కపిల్


Next Story

Most Viewed