జయలలితను మరిపిస్తున్న కంగన..

by  |
జయలలితను మరిపిస్తున్న కంగన..
X

దిశ, వెబ్‌డెస్క్ :
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్రీకరణను తిరిగి ప్రారంభించిన మూవీ యూనిట్.. ప్రత్యేకంగా నిర్మించిన అసెంబ్లీ సెట్‌‌లో పలు కీలక సన్నివేశాలను షూట్‌ చేసింది. కాగా, ఈ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నట్లు కంగనా రనౌత్ ఇన్‌స్టా వేదికగా వెల్లడిస్తూ.. పలు ఆసక్తికర ఫొటోలను షేర్ చేసింది.

జయలలిత బయోపిక్‌కు ఫైర్‌బ్రాండ్ కంగనాను ఎంచుకున్నప్పుడు చాలా మంది పెదవి విరిచారు. కానీ జయలలితగా.. కంగన మారిన వైనం చూస్తే.. విమర్శకులకు సమాధానం దొరికనట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల కోసం హాల్‌లోకి ఎంటర్ అవుతున్న ఫొటోలతో పాటు ప్రసంగిస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది కంగన. చిరునవ్వులు చిందిస్తూ, చీరకట్టులో పెద్ద బొట్టు ధరించి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూస్తుంటే.. జయలలిత యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి రూపాన్ని గుర్తుచేస్తోంది.

‘జయలలిత ఆశీస్సులతో తలైవి మరో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కరోనా తర్వాత చాలా విషయాలు భిన్నంగా మారాయి. కానీ కట్, యాక్షన్‌కు మధ్య ఏదీ చేంజ్ కాలేదు’ అని ట్వీట్ చేసిన కంగన.. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపింది. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తుండగా.. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.



Next Story

Most Viewed