ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది.. నటి షాకింగ్ కామెంట్స్

by  |
Kangana Ranauth
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడింది. తనను ప్రతీ విషయంలో ఇబ్బంది పెడుతున్నారన్న ఆమె.. ఎందుకింత కక్ష సాధిస్తున్నారని ఫైర్ అయింది. పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో వేధింపులకు గురిచేస్తున్నారని, తనపై ఓ వ్యక్తి పెట్టిన కేసు కారణంగా ఇలా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పింది. ముంబై హైకోర్టును ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని.. అప్లికేషన్ అస్పష్టంగా ఉందంటూ ఈ నెల 25కు విచారణ వాయిదా పడిందని తెలిపింది.

అయితే గతంలో అమీర్ ఖాన్ మహారాష్ట్ర గవర్నమెంట్‌పై ఆరోపణలు చేస్తే తనను సైలెంట్‌గా వదిలేసి.. ఆయన మాదిరిగానే సర్కార్ తప్పులను ఎత్తిచూపిన తనపై మాత్రం ఎందుకింత కక్ష సాధిస్తున్నారని ప్రశ్నించింది. కాగా ఈ నెల 25కు ముందే కంగన తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘తేజస్’ షూటింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. బుడాపెస్ట్‌లో సినిమా చిత్రీకరణ జరగనుండగా.. పాస్ పోర్ట్ రెన్యువల్‌ చేసేందుకు పోలీసులు ఎక్కడా లేని రూల్స్, రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story

Most Viewed