నాకెందుకింత టార్చర్? సుప్రీం కోర్టును ప్రశ్నించిన కంగన!

by  |
నాకెందుకింత టార్చర్? సుప్రీం కోర్టును ప్రశ్నించిన కంగన!
X

దిశ, వెబ్‌డెస్క్ : తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. తన ప్రశ్నలకు ఈ దేశం నుంచి సమాధానం కావాలని కోరింది. నేను ఇన్నాళ్లు మీ కోసం నిలబడ్డానని.. ఇప్పుడు మీరు నా కోసం నిలబడే సమయం వచ్చిందని వీడియో రిలీజ్ చేసింది. దేశ ప్రజలతో పాటు సుప్రీం కోర్టును కూడా ఈ వీడియో ద్వారా ప్రశ్నించిన కంగన.. దేశం గురించి మాట్లాడితే కేసులు పెడతారా? జాతి గురించి మాట్లాడితే ఇల్లు కూలగొడతారా? అని ప్రశ్నించింది. రైతుల తరపున మాట్లాడినందుకు రోజుకు ఎన్ని కేసులు పెడతారు? నవ్వినందుకు కూడా కేసు నమోదు చేయడం ఏంటో అర్థం కావడం లేదని వాపోయింది. నేటి భారతంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించిన కంగన.. మనుసులో మాటలు చెప్పలేని మధ్యయుగంలో దేశం జీవిస్తుందా? అని సుప్రీం కోర్టును అడిగింది.

https://twitter.com/KanganaTeam/status/1347433867683131393?s=20

Next Story

Most Viewed