కంగనాకు నచ్చిన ప్రదేశం అదేనా!

by  |
కంగనాకు నచ్చిన ప్రదేశం అదేనా!
X

దిశ, వెబ్‌డెస్క్: కంగనా రనౌత్ లాక్‌డౌన్‌ టైమ్‌లో చర్చోపచర్చలతో గడిపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, బాలీవుడ్ నెపోటిజం, ఇండస్ట్రీపై డ్రగ్ మాఫియా ఎఫెక్ట్.. ఇలా ప్రతి విషయం గురించి మీడియా, సోషల్ మీడియాలో చర్చించింది. అదంతా సినిమా షూటింగ్స్ లేనప్పుడు మాత్రమే.. కానీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. కెమెరా, యాక్షన్, స్టార్ట్ అంటూ ఇండస్ట్రీ బిజీ అయిపోయింది.

ఈ క్రమంలోనే తను కూడా బిజీ అయిపోయానని చెప్తోంది కంగనా. దాదాపు వారం రోజులుగా తలైవి షూటింగ్‌లో పాల్గొంటున్న భామ.. ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. సినిమాలో ఇంపార్టెంట్ సీన్ గురించి టాలెంటెడ్ డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్‌తో డిస్కస్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలో చాలా అద్భుతమైన ప్రదేశాలున్నాయని.. వాటిలో చాలా కంఫర్ట్‌గా, ప్రశాంతంగా, ఓదార్పుగా ఉండే ప్రదేశం సినిమా సెట్ అని పేర్కొంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ‘తలైవి’ సినిమా తెరకెక్కుతుండగా.. కంగనా టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండగా, సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

Next Story

Most Viewed