కేజీఎఫ్‌ విలన్‌ను కలిసిన కంగనా రనౌత్

by  |
కేజీఎఫ్‌ విలన్‌ను కలిసిన కంగనా రనౌత్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్‌ను కలిసింది. హైదరాబాద్‌లో కంగన ‘తలైవి’ షూటింగ్‌లో పాల్గొంటుండగా, సంజు కూడా ఇక్కడే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్‌కు హాజరవుతున్నారు. కాగా వీరిద్దరూ ఒకే హోటల్‌లో స్టే చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కంగన.. సంజు ఆరోగ్యం గురించి పరామర్శించేందుకు ఆయనుండే చోటుకు వెళ్లింది. అయితే సంజు భాయ్ తనకు సర్‌ప్రైజింగ్‌గా, మరింత హ్యాండ్సమ్‌గా, హెల్తీగా కనిపించాడని చెప్పింది కంగన. తన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తానన్న కంగన.. సంజుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కాగా కొంతకాలం క్యాన్సర్‌తో బాధపడిన సంజయ్.. ట్రీట్మెంట్ తర్వాత ఆ మహమ్మారిని జయించాడు. ఈ విషయం ప్రకటించగానే తన ఆరోగ్యం గురించి బాధపడిన అభిమానులు ఆనందంగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తను సూపర్ కాన్ఫిడెన్స్‌తో షూటింగ్స్‌కు హాజరవుతున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 ఫైనల్ షెడ్యూల్‌లో పాల్గొంటున్న సంజయ్.. అధీరాగా ప్రేక్షకులకు సూపర్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ అమేజింగ్ కాంప్లిమెంట్స్ అందుకుంది.


Next Story

Most Viewed