బాలీవుడ్‌ను శుద్ధి చేయాలి : కంగనా

by  |
బాలీవుడ్‌ను శుద్ధి చేయాలి : కంగనా
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్ మాఫియా కోణంతో పాటు రియా చక్రవర్తి డ్రగ్ డీలర్స్‌తో చేసిన చాట్ బయటపడటంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అండ్ టీమ్ స్పందించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తే చాలా విషయాలు బయటపడతాయని చెప్పింది. చాలా మంది ఏ లిస్టర్లు బార్ల వెనుక బారులు తీరుతారని చెప్పింది. రక్త పరీక్షలు చేస్తే షాకింగ్ నిజాలు తెలుస్తాయని.. చాలా రహస్యాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద బాలీవుడ్ అని పిలువబడే చెత్తను క్లీన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరింది.

కాగా, మోడీ జీ స్వచ్ఛ బాలీవుడ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, కంగనా రనౌత్‌ను అంబాసిడర్‌గా నియమించాలని కోరుతున్నారు నెటిజన్లు.



Next Story