ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న డాక్టర్ కామిశెట్టి సతీష్‌..

by  |
sathish
X

దిశ, హుజూర్‌నగర్: హుజూర్‌నగర్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ కామిశెట్టి సతీష్ కుమార్, డా.అబ్దుల్ కలామ్ హెల్త్ అండ్ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిభ, సేవా భావం గల డాక్టర్లకు యాక్ట్ నౌ ఫౌండేషన్ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కాగా హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో యాక్ట్ నౌ ఫౌండేషన్ చైర్మన్ మూర్తి చేతుల మీదుగా డా‌‌.సతీష్ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన నలభై మంది వైద్య నిపుణులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, గాంధీ హాస్పిటల్ వైద్య సిబ్బంది అభినందనలు తెలియజేశారు.



Next Story

Most Viewed