కామారెడ్డిలో దారుణం.. వివాహితను బలిగొన్న‘గోడ’..

by  |
కామారెడ్డిలో దారుణం.. వివాహితను బలిగొన్న‘గోడ’..
X

దిశ, కామారెడ్డి రూరల్ : గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాల్లోకివెళితే.. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన నిమ్మ నర్సవ్వ (35) అనే మహిళ సోమవారం ఉదయం గోడ కూలడంతో ప్రమాదవశాత్తు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె సోదరి స్వప్నకు తీవ్రగాయాలయ్యాయి. రోజు మాదిరిగానే ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేసి కూర్చోగా ఒక్కసారిగా ఇంటిలోని గోడ కూలి మీద పడిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. గోడ కూలి మృతి చెందిన బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed