కమలాపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

by  |
కమలాపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

అమరావతి: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఈయన.. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు. కాగా, శివారెడ్డి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు.

tag: ex mla siva reddy, kamalapuram, kadapa district, ap news



Next Story

Most Viewed