- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రకృతిని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చైన్ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు ఉత్సాహంగా ఈ చాలెంజ్ స్వీకరిస్తుండగా.. అభిమానులు సైతం వారిని ఫాలో అవుతున్నారు. ఈ మధ్య బ్యూటీఫుల్ రష్మిక మందన్నాను గార్జియస్ హీరోయిన్ సమంత అక్కినేని.. ఈ చాలెంజ్కు నామినేట్ చేయగా, యాక్సెప్ట్ చేసిన రష్మిక మూడు మొక్కలను నాటింది. ఆ తర్వాత హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శన్, రాశీ ఖన్నా, అశిక రంగనాథ్ను ఈ చాలెంజ్కు నామినేట్ చేసింది.
కాగా ఈ చాలెంజ్ను స్వీకరించిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.. చిన్న మొక్కలను కూడా కౌంట్లోకి తీసుకోవాలని కోరింది. తనకు గార్డెనింగ్ గురించి అంతగా అవగాహన లేదని.. తన స్మార్ట్ గార్డెన్లో మూడు చిన్ని చిన్ని మొక్కలను నాటినట్లు తెలిపింది. అన్నియాన్, అంబి, రెమోగా వాటికి నామకరణం కూడా చేసిన కళ్యాణి.. అనుపమ పరమేశ్వరన్, మెహ్రీన్ ఫిర్జాదాతో పాటు రాజా రాణి ఫేమ్ నజ్రియా ఫహాద్లను నామినేట్ చేసింది.