- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కల్తీకల్లు జోరుగా కొనసాగుతోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా మూడు కల్లు డిపోలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ కల్లు డిపో గుడికి సమీపంలో, మరో కల్లు డిపో అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో, మరో కల్లు డిపో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కల్తీ కల్లు జోరుగా నిర్వహిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story