ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటు తెలంగాణతో పాటు.. అటు ఏపీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్‌సాబ్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత గెలుపొందారు. సమీప అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతానని, తన విజయం కోసం కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు అని కల్పలత తెలిపారు.

కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి 50 శాతానికిపైగా ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అనంతరం కల్పలతకు 6,153 ఓట్లు రావడంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.


Next Story

Most Viewed