కాజోల్ ‘త్రిభంగ’ 2021లోనే..

by  |
కాజోల్ ‘త్రిభంగ’ 2021లోనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్.. సౌత్‌‌లోనూ ‘వీఐపీ2’లో పవర్‌ఫుల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ టైమ్‌లో ‘త్రిభంగ’అనే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ఒప్పుకుంది. బన్నిజయ్ ఏసియా, ఆల్కైమీ ప్రొడక్షన్స్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీని జులైలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ వెల్లడించారు. అన్నీ కుదిరితే కాబోల్ డిజిటల్ ఎంట్రీ కూడా అప్పుడే జరిగేది. కానీ కొవిడ్ పరిస్థితులు, మూవీ మేకింగ్‌‌ ఆలస్యం కావడం, ఇతర కారణాల దృష్ట్యా రిలీజ్‌ వాయిదా పడింది.

ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు.. మూడు తరాలకు చెందిన వారయితే, ఆ జనరేషన్ గ్యాప్ వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడుతాయి? 1980 నుంచి నేటి ఆధునిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఏంటి? వారి మధ్య ప్రేమ, కోపం, అనుబంధం ఎలా ఉంటాయి? ఆర్థిక పరిస్థితులు వారిని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ ముగ్గురి కుటుంబం ఎలా ఉండబోతుందనే? అంశంపై ‘త్రిభంగ’ మూవీ తీస్తున్నట్లు ప్రముఖ నటి, డైరెక్టర్ రేణుక శహనె వివరించారు. మూవీలోని మూడు లీడ్ రోల్స్‌లో కాజోల్, అజ్మి, పల్కర్ నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, 2021 జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు కాబోల్ డిజిటల్ ఎంట్రీ 2021లోనే ఉండబోతోంది.


Next Story

Most Viewed