కాకా హోటల్‌లో కాజల్ కేక.. హర్టవుతున్న ఆడియన్స్

by  |
కాకా హోటల్‌లో కాజల్ కేక.. హర్టవుతున్న ఆడియన్స్
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గతేడాది అక్టోబర్ 30న ముంబైలో తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ‘మగధీర’లో ‘మిత్రవింద’గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసిన కాజల్‌ను ఆమె అభిమానులు ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ట్రీట్ చేస్తున్నారు. కాజల్ తన భర్త కిచ్లుతో క్లోజ్‌గా ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
ముద్దుగుమ్మ కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుల సందర్భంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ జిల్లా పొలాచ్చి అనే ప్రాంతానికి చెందిన శాంతి మెస్‌లో డిన్నర్ చేశారు. అనంతరం డిన్నర్ మెస్‌లో ఫుడ్ ఐటమ్ టేస్ట్ గురించి వివరిస్తూ ట్వీట్ చేశారు. పొలాచ్చిలో నాకెంతో ఇష్టమైంది శాంతిమెస్. మెస్ యజమానులు శాంతి అక్క, బాలకుమార్ అన్న ప్రేమతో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేస్తుంటారు. కాబట్టే 27 ఏళ్లుగా ఈ మెస్ ను రన్ చేస్తున్నారు. 9 ఏళ్లుగా ఈ మెస్ గురించి నాకు తెలుసు. పొలాచ్చి వచ్చినప్పుడల్లా శాంతి మెస్ లోనే తింటానంటూ కిచ్లూతో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలపై నెటిజన్లు తమదైన స్టైల్లో విచారం వ్యక్తం చేస్తున్నారు.

నువ్వు కిచ్లూతో ఉన్న ఫోటోల్ని షేర్ చేయకు మేము హర్టవుతాం అని ఒకరు అంటుంటే

చిన్న కాకా హోటల్ లో ఫుడ్ బాగుంది తినండి ప్రమోట్ చేస్తున్నావు. కానీ నువ్వు మీ హబ్జెండ్ తో ఫోటోల్ని దిగడమే మాకు నచ్చడం లేదని మరో నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు.

నువ్వు కాజల్ గురించి అంత హార్ష్ గా మాట్లాడకు నేను హర్టవుతానంటూ బ్రహ్మానందం మీమ్స్ తో ఫన్ యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు మరో నెటిజన్.

మొత్తానికి చందమామగా, మిత్రవింద గా అలరించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ పెళ్లి చేసుకోవడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Next Story

Most Viewed