వీడిన మిస్టరీ.. కాచిగూడ చోరీ కేసులో అసలు ట్విస్ట్!

by  |
వీడిన మిస్టరీ.. కాచిగూడ చోరీ కేసులో అసలు ట్విస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని కాచిగూడ సర్కిల్ బర్కత్ పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీగా బంగారం, వెండి అపహరణకు గురైన విషయం తెలిసిందే. యాజమాని ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఒక్కరోజు వ్యవధిలోనే అసలు నిందితుడిని పట్టుకున్నారు. ఆ ఇంట్లో పని చేస్తున్న నందగోపాల్‌ నేరం చేసినట్లు గుర్తించడమే కాకుండా అరెస్టు చేశారు.

అతడి వద్ద నుంచి 80 తులాల బంగారం, 30తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళపు చెవి ఆధారంగా దొంగతం చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.


Next Story

Most Viewed