యాదాద్రి జిల్లాలో అమానుష ఘటన

by  |
యాదాద్రి జిల్లాలో అమానుష ఘటన
X

దిశ, నల్లగొండ: యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును పడేసిపోయారు. పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. శిశువును అక్కడ ఎవరు పడేశారో తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed