శంకర్‌పల్లి MRO ఆఫీస్‌లో జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకొచ్చారంటే..?

by  |
junior ntr-2
X

దిశ, చేవెళ్ల : జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం భూమి కొనుగోలు నిమిత్తం శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేశారు. శంకర్‌పల్లి మండలం గోపులారం గ్రామ పరిధిలో గల ఫిలిం బోర్డ్ డైరెక్టర్ నుంచి ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేశారు.

భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో అరగంటసేపు గడిపారు. అనంతరం అభిమానులు సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. తన వ్యక్తిగత పని మీద వచ్చానని అంతకుమించి తాను ఏమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed