కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి

by  |
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
X

దిశ, కామారెడ్డి : తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న జాజవ్ విజయ శుక్రవారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. ఈమె సొంత గ్రామం సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామం. కాగా మొదట అదే మండలంలోని మల్లుపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేసారు. ప్రస్తుతం ఆమె తాడ్వాయి మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కరోనా భారిన పడి ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె అస్వస్థకు గురి కావడంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతి తో అటు ఆమె గ్రామంలో ఇటు తహసీల్దార్ కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed