ప్రతి డివిజన్‌లోనూ కమలం వికసించాలి : నడ్డా

by  |
ప్రతి డివిజన్‌లోనూ కమలం వికసించాలి : నడ్డా
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తన ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. నాగోల్ -కొత్తపేట మధ్యలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు.

ఓ వైపు నగరంలో వర్షం పడుతున్నా బీజేపీ తన రోడ్ షోను కంటిన్యూ చేస్తోంది. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే హైదరాబాద్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని, అందుకు ప్రజల నుంచి వస్తున్న స్పందనే కారణమన్నారు. ఈ సారి ప్రతి డివిజన్ లోనూ కమలం వికసించాలని నడ్డా ఓటర్లకు పిలుపునిచ్చారు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నేతలు వస్తున్నారని మంత్రి కేటీఆర్ పదేపదే చెబుతున్నారని, అందుకు బదులుగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని త్వరలోనే ఇంటికి సాగనంపుతారని విమర్శించారు.



Next Story

Most Viewed