జర్నలిస్ట్ దారుణ హత్య

by  |
జర్నలిస్ట్ దారుణ హత్య
X

దిశ, వెబ్‎డెస్క్: తమిళ టీవి చానెల్ రిపోర్టర్‌ మౌసన్‌ దారుణ హత్యకు గురయ్యారు. జర్నలిస్ట్ ను గంజాయి స్మగ్లర్ల గ్యాంగ్ నవమణి హతమార్చారు. ఈ ఘటన కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాట్లాడాలని చెప్పి మౌసన్‎ను ఇంటి నుంచి బయటికి రప్పించి హత్య చేశారు స్మగ్లర్లు. ఇటీవల మౌసన్ గంజాయ్ స్మగ్లింగ్‌, భూ కబ్జాలపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాడు. దీంతో కక్ష కట్టిన స్మగ్లరు జర్మలిస్ట్‌ను చంపేశారు. మౌసన్ శరీరంపై 18 చోట్ల కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed