మరో జర్నలిస్టును బలిగొన్న మహమ్మారి

by Chintha Aamani |

<p>దిశ, మంచిర్యాల: జర్నలిస్టులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజూ వందల సంఖ్యలో రిపోర్టర్లు మహమ్మారి బారినపడటమే కాకుండా.. అనేకమంది వైరస్‌‌కు బలై మృతిచెందుతున్నారు. తాజాగా.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, హిందీ మిలాప్ రిపోర్టర్ కొండ్ర శ్రీనివాస్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అందరితో కలివిడిగా ఉంటూ వార్తల సేకరణలో నిత్యం ముందుండే [&hellip;]</p>

Journalist died
X

దిశ, మంచిర్యాల: జర్నలిస్టులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజూ వందల సంఖ్యలో రిపోర్టర్లు మహమ్మారి బారినపడటమే కాకుండా.. అనేకమంది వైరస్‌‌కు బలై మృతిచెందుతున్నారు. తాజాగా.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, హిందీ మిలాప్ రిపోర్టర్ కొండ్ర శ్రీనివాస్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అందరితో కలివిడిగా ఉంటూ వార్తల సేకరణలో నిత్యం ముందుండే శ్రీనివాస్ మరణాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం పట్ల జిల్లాలోని జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story