గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. మే 24న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు

by Dishafeatures2 |
గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. మే 24న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు
X

దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీలు వెల్లడించింది. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కొత్త తేదీల ప్రకారం మెయిన్స్‌ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పది జిల్లాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.




Next Story

Most Viewed