నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షా ఐదువేల కొత్త ఉద్యోగాలు

by  |
Jobs
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. ఇంజనీరింగ్ అయిపోయింది ఏదైనా మంచి కంపెనీలో జాబ్ సాధించాలని ఆశపడిన విద్యార్థుల ఆశలు అడియాశలు అయ్యాయి. చదువు అయిపోయి, ఉద్యోగం లేక చాలా మంది మానసికంగా కుంగిపోయారు. కరోనా సమయంలో చాలా కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగులను తీసేయడం జరిగింది. కాబట్టి ఏ కంపెనీలు ఫ్రెషర్స్‌కు అవకాశం ఇవ్వలేదు. అందువలన చదువు అయిపోయిన చాలా మంది కరోనా సమయంలో నిరుద్యోగులుగా మిగిలి పోయారు.

అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు తీపికబురును అందించాయి. టీసీఎస్, ఇన్‌ఫోసిస్, విప్రో దేశీయ అతిపెద్ద కంపెనీలు.. ఇప్పుడు ఫ్రెషర్స్‌ కోసం లక్షకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ముగిసిన త్రైమాసికంలో ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్‌ఫోసిస్, విప్రోం సంస్థలు రూ.17,446 కోట్ల లాభాలను ఆర్జించాయి. దీంతో ఈ ఏడాదిలో దాదాపు లక్షా ఐదువేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. జూన్ త్రైమాసికంలో విప్రో కంపెనీ ఆదాయం 12 శాతానికి పెరగడంతో.. విప్రో కంపెనీలోనే 30 వేల మందికి ఉద్యోగ అవకశాలు కల్పిస్తామని తెలిపింది.


Next Story