ఒకేషనల్ విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్.. జాబ్ మేళా వాయిదా!

by  |
Jobs
X

దిశ, కోస్గి : ఈ నెల 30న ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఇంటర్ ఒకేషనల్ గ్రూప్ జాబ్ మేళాను వాయిదా వేస్తున్నట్లు నారాయణపేట జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రియాద్ హుస్సేన్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి ముందు ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటిషిప్ శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు. కానీ, గులాబ్ తుఫాన్ వలన కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ జాబ్ మేళాను మళ్లీ ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed